మునుపటి నా మాట
అన్నట్టే నాలుగు రోజులు గడిచాయి కనక మళ్ళీ మరిన్ని 'ఈల'పాటలు- పూర్తిగా తెలుగువే- వినిపించాలని, ఈలల మధ్య కా' సిన్ని మా' కబుర్లు కూడా చేర్చాలని ఇవాల్టి ప్రయత్నం. అలనాటి హీరో దేవానంద్ ఇప్పటి వయసు ఎనభై అయినా సినిమాలు (ఎవరు చూసినా చూడకపోయినా సరే ) తీసి 'పారేయడమే' ధ్యేయం గా పెట్టుకోవడం ఆశ్చర్యమే మరి. అదే ఎనభై వయసులో ఉన్న దర్శకుడుబాపు ఇన్నాళ్ళు ఆగి 'లవకుశ' ని తిరగ రాసి రమణ సాయం లేకుండానే 'శ్రీరామరాజ్యం' చిత్రకళా ఖండం చూపించి 'హిట్' లర్ అయి అందరి చేతా శాంతంగా బాల నయన తారక మంత్రం జపించేలా చేశారు. అయితే ఇదివరకే ఆయన లవకుశ సాంఘిక ప్రతిని ముత్యాల ముగ్గు గా తీర్చి దిద్దిన సంగతి మనకి తెలిసినదే. అహోబాపూ, ఈ లీల మీ పునర్దర్శనం కావడం మా చేత ఈల వేయిస్తోంది. దేవానంద్ తోనూ,బాపు-రమణ ల తోనూ ఇప్పుడు కొంచెం పనుంది. ఇప్పటికీ దేవానంద్ అందరికి గుర్తున్నా ఇంచుమించు ఆయన లాగ కనిపించే నటుడు రామ్మోహన్ (కనుకనేఆంధ్రా దేవానంద్ అనేవారు) ని మాత్రం చాలామంది మరిచిపోయే ఉంటారు. నట శేఖర కృష్ణతో తెలుగు తెరంగేట్రం చేసిన రామ్మోహన్ ( తేనెమనసులు ) కి తొలి తెలుగు రంగుల సాంఘిక చిత్రమే తొలి చిత్రం కావడంఆదుర్తి సుబ్బారావు కల్పించిన అదృష్టం. అయితే అందులో దాశరథి వారి దివినుండి భువికి దిగివచ్చే పారిజాతంపాట సముద్రపొడ్డున చిత్రీకరించడం వల్ల రామ్మోహన్ వేషధారణ కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. పైగా ఆదుర్తివారి పాటల్లో పాత్రలు ఊరికే గడ్డివాము మీద దేకుతుంటాయి ( తేనెమనసులు లో ఈ పాట లాగే బుద్ధిమంతుడు,పూల రంగడు పాటలు ఉదాహరణలు). రామ్మోహన్ కి వెంట వెంటనే ఆదుర్తి వారి దర్శకత్వంలోనే మరో మనసులు చిత్రం- కన్నె మనసులు- దక్కింది. రమణ గారి బుడుగు చెప్పే ప్రైవేట్ మాస్టారి గురించి బహుశాఆదుర్తి వారు విన్నారేమో ఆయన రామ్మోహన్ తోనే ప్రైవేట్ మాస్టర్ సినిమా తీశారు.
0 Comments
19 నవంబర్ – ఈ రోజుకో ప్రత్యేకత ఉంది- దివంగత ప్రధాని ఇందిరా గాంధి జయంతి. నవ భారతంలో తనదైన ఒక వినూత్న శైలిలో దేశాన్ని అభ్యుదయం వైపు నడిపించిన స్త్రీ మూర్తిగా, రాజకీయ నాయకురాలిగా ఆమె నంతా ఎరుగుదురు. ఒడిశా లో చివరి ప్రసంగంలో – తన శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు దేశానికే అంకితం – అని ఉద్ఘాటించిన ధీరురాలు. చివరికి అనూహ్యంగా రాజకీయ చదరంగం లో పావుల కదలికలో తేడాలొచ్చి స్వీయ రక్షక భటుల తూటాలకే బలై పోయిన అమాయకురాలు. ఆమె పాలనలో ఆమె ప్రకటించిన ఎమెర్జెన్సీ అనేది తప్పు దారి పట్టిపోయి అదో చీకటి అనే భావన కలిగించింది ఆనాటి డబ్భైలలో. అది మినహాయిస్తే – మహాత్ముడే కలలు కన్న మరో ప్రపంచం అని అంటూనే మన ఇందిరమ్మ కలలు కన్న మరో ప్రపంచం అని మహాకవి శ్రీశ్రీ వంటి వారి చేత కూడా పొగడ్తలందుకున్న ఏలుబడి ఆమెది. మరో కవి ‘ఆదర్శనారిఇందిరా గాంధి’ అంటూ ‘నేనూ నా దేశం – పవిత్ర భారత దేశం’ లో చరితార్దులైన వారి లిస్టులో ఆమెను చేర్చారు. బహుశా మొత్తం దేశంలో ఇలా రెండు తెలుగు పాటల్లోనే ఆమె ప్రసక్తి రావడం గమనించవచ్చు. ఎమెర్జెన్సీ ఎత్తివేయగానే దేశమంతటా ఒకటే ‘ఈలలు’. ఇందిరమ్మ సమక్షంలో తన ‘ఈలపాట’ వినిపించిన ఘనత మన కళ్యాణం రఘురామయ్య గారిదే. ఆయన ఎంతటి ప్రతిభావంతుడంటే అసలు పేరు వెంకట సుబ్బయ్య ఐతే తన ‘రఘురాముడి’ పాత్ర తో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారినే ఆశ్చర్య పరచి ఆయన నోటి చలువచేత ‘రఘురామయ్య’ గా మారిపోయారు. ఇక కలకత్తా లో రవీంద్ర కవినే మెప్పించి ఆయన ద్వారా ‘దక్షిణ నాటక కోయిల’ అనే బిరుదు పొందారు. ఒక పక్క నాటకం, సినిమా, పాట, పద్యం – అనే చతుర్విధ కళల తో పాటూ ‘కూ’ అనే పంచమ స్వరం పలికించే కోయిల లాగ ‘ఈల పాట’ ఒకటి బోనస్ గా సంపాయించుకున్నారు. అలా పంచముఖు డయ్యారు. ఆయన్ని ‘మురళి లేని కృష్ణుడు’ అని అనే వారు. నాలుక కింద వేలూని అదే వేణువుగా మార్చుకునీ ఆయన కీర్తనలు ఆలాపించేవారు. ఆయన మరణానికి పూర్వం విజయ చిత్ర మాస పత్రిక ఆయన మాటలు, ఇందిరమ్మ సమక్షంలో ఆయన ఈల పాట వినిపించినప్పటి ఫోటో ప్రచురించింది. ‘తిరుగు లేని మాట’ దారిలో ఒక సారి తిరిగి వచ్చి ఇటు వస్తారా? |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|