మునుపటి నా మాట
'ఆమనీ పాడవే హాయిగా--- మూగవై పోకు ఈ వేళ' ఆ పాట పల్లవి ఇప్పటికి సార్ధకమైంది. ఉత్తరాన- ఆమనిలోనే ఆ 'మనీ' వికృత చేష్టలకు కళ్ళెం వేయాలని గొంతెత్తినఅన్నాహజారే తో జనం గొంతు కలిపింది. ఇన్నాళ్ళూ మూగవై పోయిన నోళ్ళు ఒక చోట మూగగానే ఎంతో మంత్ర శక్తి ఆవహించింది. హజారే అంటే అవినీతి పక్కలో కైజారే! అంత నిరాడంబరుడూ, లక్ష్య సాధకుడూ దేశంలో అరుదు కనుక అతన్ని బిరుదులు వరించాయి. అయినా వాటికి మురిసిపోక తన గమ్యం రమ్యం గానే సూచించ గల ధృఢ మార్గ దర్శి ఆయన. ఈ 'లోక్ పాల్ ' విజేతకు జేజేలు. అన్నా 'పౌర శక్తి' కి నిదర్శనమే 'సిటిజన' మద్దతు. దక్షిణాన- తమకోసం ఆవిర్భవించిన మహా మనీషి, తొంభై ఆరేళ్ళ వరకూ మీకు అండగా ఉంటానన్న దైవ శక్తి సత్య సాయి బాబా అకస్మాత్తుగా అనారోగ్యం పాలైతే అక్కడ భక్త జనం గొంతు కలిపి భజన చేసింది. లోక కళ్యాణం ఆశించే సాయి వారికి సర్వదా నమస్సులు. బాబా లోని 'సౌర శక్తి'యే భక్త చంద్రుల వెన్నెల!
1 Comment
శ్రీ పంచమి నాటికి స్వీకారం చుట్టి శివ రాత్రి వరకు ఎన్నో ముఖ్యమైన పండుగలు పూర్తి చేసుకుంటుంది మాఘ మాసం. మాఘ స్నానాలు పవిత్రమైనవి- అని చెప్పి పోతుంది, అదీ మన మంచి కోసం. శివుడికీ నీటికీ అనుబంధముంది. ఈశాన్య దిక్కుకి పెద్ద దిక్కు శివుడే. గృహ వాస్తు లో ఈ దిక్కులోనే నీటిని పొందమంటారు. గంగను తల మీద మోయడం తలకు మించిన భారమనుకోక భగీరథ ప్రయత్నానికి సాయపడిన వాడు ఈ సాంబ శివుడు. దేవులపల్లి వారు ఏమన్నారూ?- ‘శ్రీ శైలం మల్లన్న శిరసొంచేనా చేనంతా గంగమ్మ వాన’ అనేగా. వర్షాభావం ఏర్పడినప్పుడు తల్లడిల్లిపోక, డిల్లీకి పోక కర్షక హృదయం శివుడినే నమ్ముకోవాలి. రథ సప్తమి – మాఘ మాసం శుక్ల పక్షంలో ఏడవ తిథి.
‘సప్తాశ్వ రథ మారూఢమ్ ప్రచండమ్ కశ్యపాత్మజమ్ శ్వేతపద్మ ధరమ్ దేవమ్ తమ్ సూర్యమ్ ప్రణమామ్యహమ్’ ఈ శ్లోకంతో ఆ భాస్కరుని స్తుతిస్తూ ఈ పూట నా మాట గా ------ జనవరి 24 (2011) వ తేదీన పూణే (మహారాష్ట్ర) లో భారత రత్న, ప్రముఖ గాన కళా కోవిదుడు పండిట్ భీమ్ శంకర్ జోషి గంధర్వ లోకానికి తరలి పోవడం తెలిసినదే. మహారాష్ట్రలో ఆయన్ని ‘స్వర భాస్కర’ అంటారు. ఆయన పేరునే సమీకరిస్తే ‘గళ భీమ’ (అనితర సాధ్యమైన బలమైన గళం ఆయనది కనుక), సంగీత సేన ( ఆయన శిష్య గణమే ఒక సేన కనుక), కంఠంలో ‘జోష్’ ఉన్న తేజస్విగా ఆయన్ని కొనియాడవచ్చు. ఆయన స్మృతి చిహ్నంగా పూణే కార్పోరేషన్ వారు ఫిబ్రవరి 11 న మరో ‘భారత రత్న’ , సునాద సుస్వర సుకుమార గళ విన్యాసిని ‘లతా మంగేష్కర్’ ను ‘స్వర భాస్కర భీమ్ సేన్ జోషి అవార్డ్’ తో సత్కరిస్తున్నారు. ‘లతా దీదీ’కి అభినందనలు, అభి వందనాలు. ‘వీనుల విందు’లో లతా పాడిన ‘నిద్దురపోరా తమ్ముడా’ వినండి. మధ్యలో ఘంటసాల మాస్టారు కూడా ఆలపిస్తూ వస్తారు. అవును తన గానంతో మనల్ని లేపి లేపి అలసి అలసి ఆయన ఫిబ్రవరి 11న శాశ్వతంగా నిదుర పోయారు. రేపటి నా మాట ఆయన గురించే. -- తాతిరాజు వేణుగోపాల్, ఫిబ్రవరి 10, 2011 ఈ అయిదవ తిధి అందరికీ సుపరిచితమే.
తల్లి సరస్వతిని పూజించేది ఈ తిధినే. చదువుల తల్లి- మన అమ్మకీ, నాన్నకీ, మనకూ అందరికీ ‘మాట’ నేర్పే మా మంచి తల్లి. మనకు జ్ఞాన మిచ్చే జనని. పంచ భూత (ఆకాశం, భూమి, గాలి, నిప్పు, నీరూ) ప్రపంచంలో సకల సువిద్యలు పంచి పెట్టే అమృత హస్తం ఆమెది. అదే హస్తం ‘వీణ’ మీటి సంగీత ప్రపంచాన్ని ఆవిష్కరించి వీనులకు విందు కూర్చింది. పంచమి తిథి తనదైన కారణం చేత కోకిలకి పంచమ స్వరం ఇచ్చి వసంత ఋతువు మొదలయ్యేలా ప్రకృతిని చూసుకోమంది. ‘పలుకు’ ను పలక మీద పరచి ‘అక్షరం’ (నాశం కానిది) అనే అద్భుత విషయాన్ని ప్రసాదించింది. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|