మునుపటి నా మాట
పుణేలో ‘శ్రీశ్రీ poly clinic’ అని ఒక చోట చదివి (అయిదారేళ్ళ క్రితం), ‘ఆహా శ్రీ శ్రీ అభిమానులెవరో గానీ ఆయన పేరు పెట్టుకున్నారే!’ అని ఆశ్చర్యపోతూ ఆనందించాను. ఆలస్యంగా వెలిగింది- శ్రీశ్రీ అంటే గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ అనీ! రవిశంకర్ తెలుసా అంటే తెలియకేం, సితార పండిట్! అనే రోజులూ కావిప్పుడు. కాలం మారుతూ ఉంటుంది. కాలంతో పాటూ జ్ఞాన తృష్ణ కూడా మారుతూ ఉంటుంది. కాలంతో పాటు మనిషి జీవన విధానం అస్తవ్యస్తం అవుతూ ఉంటే దాని మూలాలు వెతికి పట్టుకునే వాళ్ళూ, పరిష్కారం ఇదైతే బావుంటుందేమో అని కొన్ని ‘ఇజాలు’ భుజాల మోసుకొచ్చి అవి భారంగా అనిపించుకోక బాధ్యతగా తీసుకునే వాళ్ళూ ప్రపంచంలో అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన వ్యక్తీ, కవీ మన శ్రీరంగం శ్రీనివాసరావు మాస్టారు. పసివాడినుంచీ పండు ముసలి వరకు నాల్క మీద సునాయాసంగా పలికే ‘శ్రీశ్రీ’ అన్న మాట, మాస్టారు పేరుకి సంక్షిప్త రూపమన్న మాట. శ్రీశ్రీ – ఒక చిత్రమైన ఏకాక్షర కలయిక. అలాగని శ్రీశ్రీ ఏకాకి కాలేదు ఎప్పుడూ. చేతుల్లో కలం, మెదడులో బుద్ధి బలం, పిలుపులో ప్రజా శక్తి ఆయన వెంట ఉన్నవే. శ్రీరంగం శ్రీనివాసరావు అన్నది నూటొక్క ఏళ్ళ క్రితం కుదిరిన పేరు. కుదించిన శ్రీశ్రీ అనే పేరు మరో శతాబ్దాన్నీ నడిపించే సౌరతేరు. బాగా దూరం నుంచి చూస్తే ‘శ్రీరంగంశ్రీనివాసరావు’ కచ్చితంగా ‘శ్రీశ్రీ’ గా కనిపిస్తారు. చాలా దగ్గరనుంచీ చూస్తే మటుకు ఆ రంగం, ఆ నివాసం కూడా కనిపిస్తాయి. ఆ రంగం సినీ రంగం. ఆ నివాసం ప్రజల గుండె.
0 Comments
భవ సాగరమన్నది భగవంతుని నిర్ణయమైతే సత్సంగ్ ఒక్కటే నావ యనీ సాటి మానవ సేవయే త్రోవయనీ స్వచ్ఛమైన ప్రేమయే తెడ్డు అనీ చాటి చెప్పి సుదూర తీరాలకు తరలి పోయిన దివ్య సరంగు సత్యసాయి నిత్య స్మరణీయులు ఒక ఉత్తరాషాఢ నుండి మరొక ఉత్తరాషాఢ వరకు చేసిన ఒక సంపూర్ణ చంద్ర మాస యానంలో ఆ తనువు రేవు దాటింది. ఆ ఆత్మ సూర్య తేజస్సుతో మళ్ళీ ఉద్భవిస్తుందని క్షణ క్షణం దక్షిణం ఆశతో ఎదురు చూస్తూ ఉంది. -డా. తాతిరాజు వేణుగోపాల్, 25 ఏప్రిల్ 2011 ఆ( వేణూ --- ఏమిటీ – కవి గారు ఆరుద్ర, నటీమణి షావుకారు జానకికాంబినేషన్ అంటూ ఏదో అన్నావ్’ ‘వారితో పాటూ మరో జానకి –అదే మన సంగీత సరస్వతి ఎస్. జానకి –గురించి కూడా, ఎందుకంటే మా జానకమ్మ పుట్టిన రోజు ఈ శనివారం , ఏప్రిల్ 23న. ఈ 22వ తేదీ ఉందే దీన్ని ప్రతి ఏటా ‘పృథ్వీ దినం’ గా పాటిస్తారు. ప్రతి ఏడూ ఓ సందేశం ఉంటుంది. ఈ ఏడాదికి ‘గ్రీన్ ఎర్త్’ (హరిత పృథ్వీ) అనుకోమన్నారు.’ ‘ఓహో—అలాగా—అయితే ముందు జగమే పచ్చని ప్రకృతితో ఊయలూగాలని ఆశిద్దాం. ఊహలకే కన్నులుంటే జగమే ఊయలని చెప్పిన జానకమ్మకి మనందరి తరఫున హార్దిక శుభాకాంక్షలు కృష్ణ ప్రేమ ద్వారా’ ‘జానకి పియానో మెట్లు మీటకుండానే పాట పాడితే పగలే వెన్నెల. జానకి ఉయ్యాల ఊపకుండానే పాట పాడితే వెన్నెల తెస్తాడు ప్రతి పాపడు. జానకి నాట్యం చేయకుండానే ‘ఓమ్ నమశ్శివాయ’ అని పాట పాడితే శివుడి సిగలో ఉన్న నెలవంక పున్నమి చంద్రుడవుతాడు. అమ్మా జానకమ్మా --- సిరిమల్లె పువ్వల్లె నవ్వే పసిపాపలా, రామచిలకా పెళ్లికొడుకెవరే అనే సిగ్గూ పూబంతి పదహారేళ్ళ పడుచులా, మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం అనే ముదుసలిలా ఒకే గొంతులో ఎన్నో మరెన్నో అభినయాలతో మీ పాట ‘మా జానకి పాట పట్టగ’ అనే కీర్తనగా మారి పోవాలని పది కాలాలు మీరు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాం’ ‘మొత్తానికి – నాకు తెలిసి 1964 లోని పూజా ఫలం పాట, 1968 లోని అత్తగారు-కొత్త కోడలు పాట, 1983 లోనిసాగర సంగమం పాట ‘కనులు మూసినా పాటే’ లో వినిపిస్తున్నావ్. అవునా?’ “టైటిల్ చివర్లో చూస్తే---అందమైన రహస్యం గా నువ్వంటున్నా ---సుందర గోప్యం—అనేది మన పేర్ల కలగలుపులా అనిపిస్తున్నాది గోపీ” “ యమా కరెక్ట్ గా పోల్చేవు, సుందరూ” “ఇంతకీ ఆ ‘వారు’ ఎవరు? ఈ ‘వీరు’ ఎవరు?” “ వస్తున్నా –వస్తున్నా... వారి పేరు ‘ఆచార్య అత్రే’, వీరి పేరు ‘ఆచార్య ఆత్రేయ’--- అదన్న మాట” “సరిగ్గా విన్నానా? ఆచార్య కామన్ గా ఉంది, ఒకరు అత్రే, ఒకరు ఆత్రేయ. ఒకరే అనుకునే ప్రమాదం ఉంది. కానీ కాదు. కరెక్టేనా?” “మళ్ళీ యమా కరెక్ట్. అత్రే అన్న మాట బట్టి చూస్తే మహారాష్ట్ర కి చెందిన పేరని అనిపించిందా?” “అవుననుకో. ఆయన ఎవరో, ఏమా కథ? ఈయన మన సుకవి, అదే ‘మనసు కవి’ ఆత్రేయ అని ఇప్పుడే పుట్టిన బిడ్డ కూడా చెప్పగలదు” శ్రీ రామ నామం ఒక్కటి చాలు – మన శరీరంలోని, మన మనసు లోని ‘ ఎనర్జీ’ రీ చార్జ్ కావడానికి. అందుకే ఆనాటి పెద్దవాళ్ళు పనుల మధ్యలో ‘శ్రీ రామ’ అంటూ అలసటని ఆవలకి నెట్టేస్తూ ఉండే వారు. త్రేతా యుగం, ఆ యుగం, ఈ యుగం అనే లెక్కలకు అతీతంగా ఉండే ఓ అద్భుత శక్తి రాముడు. శ్రీ రామ కథ అంటే మొత్తం రామాయణం, లేదూ అంటే రామాయణం లోని ప్రతి ఒక్క కాండ! రామాయణం కల్ప వృక్షం. ఒక్కొక్క కాండ ఒక శాఖ. అందుకే వాల్మీకి రామాయణం ‘నిత్య’ పారాయణం చేయడం ఎందరికో ఇష్టం. కానీ కొందరికి సంస్కృతం అంటేనే చాల కష్టం. ఇదిగో ఇటువంటప్పుడే ఒకరు మంచిని బోధిస్తే ఆ సారాన్ని వారి వారి భాషల్లో తెలియ జేయడం అనేది గొప్ప గొప్ప మేధావులు చేసే పని అని తెలుస్తుంది.. ఉత్తర భారతాన అంటే తూర్పు ఉత్తర ప్రదేశ్ లో అవధి భాష ఉంది. తన భాషలో వాల్మీకి రామాయాణ గాధని సరళంగా చెప్పాలని తపన పడి సరిగ్గా శ్రీ రామ నవమి నాడే ( 1574 లో) శ్రీకారం చుట్టేడు తులశీ దాస్ గోస్వామి. అప్పటికి ఆయన వయసు నలభై రెండేళ్ళంటారు. అదే ‘శ్రీ రామ చరిత్ మానస్’ అంటే శ్రీ రామ లీలా మానస సరోవరమన్న మాట. చాలా చోట్ల ‘తులసీ రామాయణం’ అని అంటారు. ‘ఇదీ ఒక కావ్యమా’ అని ఆ తరం పెద్దలు ఈసడించుకున్న వారూ ఉండే వారట. చదవగా చదవగా అందులో భక్తి, జ్ఞానం, ముక్తి లేదా మోక్షం అనే మూడు అంశాలు ఉన్నాయని తెలుసుకునీ, తేల్చుకునీ ఆనక వేనోళ్ళ కొనియాడేరట. ఏడు అధ్యాయాల ఈ గ్రంధం సుమారు రెండున్నర ఏళ్లలో అయోధ్య, వారణాశి ప్రాంతాల్లో ఉంటూ రాసి పూర్తి చేసాడట ఆయన. కావ్య నియమం లో చౌపాయీ, దోహా, ఛంద్ ప్రయోగించాడు. ఈ దోహా మన ద్విపద లాంటిది. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, లంకా, ఉత్తర కాండలు రాసి వాల్మికి చెప్పిన లవ కుశ ఉదంతం మాత్రం విడిచి పెట్టేడట తులసీ దాస్. కారణం- అంత ‘సుకుమార ప్రేమ మూర్తి’ గా తను చిత్రించిన ‘సీతామాయి’ని కష్ట రూపంలో చూపించడం ఇష్టం లేక. బాల కాండ నిడివి కూడా ఎక్కువగానే ఉన్న శ్రీ రామ చరిత్ మానస్ లో లౌకిక, పారమార్ధిక భావ తరంగాలు సమ ఉజ్జీలుగా విరుచుకు పడుతుంటాయి. 'ఆమనీ పాడవే హాయిగా--- మూగవై పోకు ఈ వేళ' ఆ పాట పల్లవి ఇప్పటికి సార్ధకమైంది. ఉత్తరాన- ఆమనిలోనే ఆ 'మనీ' వికృత చేష్టలకు కళ్ళెం వేయాలని గొంతెత్తినఅన్నాహజారే తో జనం గొంతు కలిపింది. ఇన్నాళ్ళూ మూగవై పోయిన నోళ్ళు ఒక చోట మూగగానే ఎంతో మంత్ర శక్తి ఆవహించింది. హజారే అంటే అవినీతి పక్కలో కైజారే! అంత నిరాడంబరుడూ, లక్ష్య సాధకుడూ దేశంలో అరుదు కనుక అతన్ని బిరుదులు వరించాయి. అయినా వాటికి మురిసిపోక తన గమ్యం రమ్యం గానే సూచించ గల ధృఢ మార్గ దర్శి ఆయన. ఈ 'లోక్ పాల్ ' విజేతకు జేజేలు. అన్నా 'పౌర శక్తి' కి నిదర్శనమే 'సిటిజన' మద్దతు. దక్షిణాన- తమకోసం ఆవిర్భవించిన మహా మనీషి, తొంభై ఆరేళ్ళ వరకూ మీకు అండగా ఉంటానన్న దైవ శక్తి సత్య సాయి బాబా అకస్మాత్తుగా అనారోగ్యం పాలైతే అక్కడ భక్త జనం గొంతు కలిపి భజన చేసింది. లోక కళ్యాణం ఆశించే సాయి వారికి సర్వదా నమస్సులు. బాబా లోని 'సౌర శక్తి'యే భక్త చంద్రుల వెన్నెల! నిత్య వసంతుడు అక్కినేని వారికి హిందీ అభినందనలు – కొత్త వసంతంలో తక్కిన వారికి తెలుగు శుభాకాంక4/4/2011 ‘అతడక్కినేని ధీనిధి’ – ఈ పలుకులు సరస్వతీ గిరి గారివి. అంటే ఒకప్పటి భారత రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి గారి సతీమణివి. గిరి గారంటే బరంపురం వారనీ మాకో గర్వం. గిరి గారి నమస్కార ముద్ర భలే తమాషాగా ఉండేది. జోత అనేది మొహానికి అడ్డుగా ఉండకుండా చూసుకునేవారు. ఇప్పుడు దాసాహేబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత, పద్మవిభూషణ్ డాక్టర్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి కొత్తగా జోతలు ఎందుకో అనుకునేవారికి కొంత సమాచారమివ్వాలి. డాక్టర్ అనేది రెండుసార్లు దొర్లింది, ప్రింటింగ్ తప్పు కాదు. నిజమది. ఇటీవల ఆయనకి దక్షిణ భారత హిందీ ప్రచార సభ గౌరవ డాక్టరేట్ను చెన్నైలో జరిగిన 74వ వార్షికోత్సవ సభలో ప్రదానం చేసింది. తెలుగు సినిమా వయసు కూడా 75 సంవత్సారాలు దాటింది. అందులో మొదటి పదేళ్లు ఆయనవి కావు కనక అవి తీసేస్తే అప్పటినుంచీ ఇప్పటికీ ఎప్పటికీ యవ్వనుడు అక్కినేని. ఉగాది సందర్భంలో చెప్పాలంటే ‘నిత్య వసంతుడు’. మహాకవి కాళిదాస్ 'మేఘ దూత్' విరచిస్తే అక్కినేని ఆ 'మహాకవి కాళిదాసు' గా నటించి ఆనక 'మేఘ సందేశం' కూడా వినిపించారు. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఆయనకి 'కాళిదాస్ సమ్మాన్' ప్రకటించింది కూడా. అన్ని ఋతువుల ఋజువు అక్కినేని. అయితే అక్కినేనికి ఆమని తోనే ఎక్కువ అనుబంధముంది. వ్యక్తికే కాని నటనకి శిశిరం లేదని నమ్మే వ్యక్తి ఆయన. భగవంతుని మీద కన్న స్వయం కృషి మీద నమ్మకం పెంచుకున్న శక్తి ఆయన. అందుకే అ -అంటే అక్కినేని అన్నంత ఉన్నతంగా ప్రపంచ చిత్ర సీమ ఆయన్ని గుర్తించింది. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|