మునుపటి నా మాట
మూడు పదుల మాయ వయసు .... ఆ మహనీయునికి మాత్రమే తెలుసుమహర్షులు, మహనీయులు, మహాత్ములు, మహానుభావులు, మామూలు మనుషులు- జాగర్తగా చూస్తే ఇది భూమ్మీది మానవుల మధ్య ఉన్న పంచ మకార విభజనగా కనిపిస్తోంది కదూ. పంచ మకారమంటే మదం, మోహం, మత్సరం, మదిర, మగువ అనే అయిదు మనోవికారాలు అన్నది మరవకూడదు. వీటికి దూరంగా ఉండాలన్నది దైవజ్ఞుల ప్రవచనం. వీటిని అధిగమించి మనగల్గిన వారే మనం ముందు చెప్పుకున్న మకార పంచకంలోని మొదటి నలుగురు. అంటే మామూలు మనుషులు నిత్యం మనో వికారాలతో జీవిస్తూ ఉంటారన్న మాట. ప్రాత:స్మరణీయుడు అనదగ్గ మహానీయులు ఆది శంకారాచార్యులు. వైశాఖ శుక్ల పంచమి నాడు శంకరుల జయంతి. శంకరులు ఎప్పటి వారు! కేవలం మూడు పదుల కాలం జీవించిన భారతీయ సమైక్యతా మూర్తి ! శంకరులు కేరళ లోని కాలడి ప్రాంతంలో ‘నంబూద్రి’ వంశాంకురంగా జన్మించి ఇవాళ ఆంధ్రుల తలపుల్లో కొలువున్నారు. కారణం – భద్రాచలం కొండపైన ‘ఎటపాక’ వద్ద ‘అతిరాత్రం’ యాగం నంబూద్రీ ల సమక్షంలో జరుగుతుండడమే. [స్వగతం: సమాజ శ్రేయస్సు కోసం పరిపాలకుడు సంకల్పం కలిగి ఉండి యజ్ఞం తలపెట్టాలి. ఆ యజ్ఞానికి తానే సతీసమేతంగా ‘యజమాని’ (యజ్నస్వీకర్త) అవ్వాలి. ఈ ‘అతిరాత్రం’ యాగం పన్నెండు రోజులు జరుగుతుంది. ఇది 2012 వ సంవత్సరం కావడం వల్ల పన్నెండు సంఖ్యకు విలువ పెరిగింది. మనకున్న పన్నెండు మాసాలకి ఒక్కొక్క రోజు చొప్పున పన్నెండు రోజులు తీసుకోవడం ఇందులోని ప్రత్యేకత. శ్రీ రాముడు సతి సీతతో, అనుజుడు లక్ష్మణుడి తో వనవాసంలో గోదారీ తటాన నెలవు ఏర్పరచుకున్నప్పుడు మాయావి రావణుడు సీతనపహరించడం, మార్గ మధ్యమం లో ‘జటాయు’ రావణుడితో శక్తికి మించి పోరాడి రెక్కలు తెగి రామపాదాల చెంత పడిపోయి ఎవరు ఏ దిశలో సీతమ్మను ఎత్తుకు పోయారో చెప్పి అసువులు బాయడం, తరువాత శ్రీరాముడు ఆ విగత జీవికి తగిన కర్మకాండ జరపడం ఇదంతా ఈ భద్రాచల ప్రాంతంలోనే సంభవించడం వల్ల ఈ ప్రాంతం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ‘అతిరాత్రం’ యజ్ఞంలో ఉపయోగించే ముడి సరుకు రసాయన మిశ్రమం కాదు, అంతా ఓషధ గుణాలున్న వన్య విశేషమే. ఇది ఎంత మాత్రం ‘ప్రదూషణ’ కారకం కానే కాదు. ‘ఇన్ని కోట్లా ఒక యజ్ఞానికి!’ అని నొసలు చిట్లించుకునే వారు మిగతా ఎన్ని పనికిరాని పనులకి కోట్లు నీళ్ళలా ఖర్చౌతున్నాయో ఆలోచించాలి. ఒక సంప్రదాయం మంచి కోసం అయినప్పుడు అడ్డుపడడం తగని పని. ఇందులో శాస్త్ర మర్మమేముందీ అని గోళ్ళు గిల్లుకునేవారు పరిశోధనలకి పూనుకోవాలి].
0 Comments
పుస్తకం లేని ప్రపంచం, పప్పు లేని కంచం! ధరిత్రీ దినోత్సవం (ఆదివారం, ఏప్రిల్ 22), వెంట వెంటనే ప్రపంచ పుస్తక దినోత్సవం (సోమవారం, ఏప్రిల్ 23) ఊరికే వస్తున్నాయా? భూమి తాపం ఎక్కువౌతున్న నేపధ్యంలో ధరి’ట్రీ’ని కాపాడండి మొర్రో అనే నినాదాలు గత పదేళ్లలో మరీ ఎక్కువయ్యాయి. పుస్తాకాలని రక్షించండి కుర్రో అంటే కుర్రకారు వింటోందా? పుస్తకాలకి వెదురూ గట్రా కావాలి కదా, మరి వెదురును నాశనం చెయ్యడం పాడి కాదు కదా అని వారిచ్చే సమాధానం ఆలోచించ దగ్గదే. ఈ మధ్యనే ఒక పాడు వార్త విన్నాం- ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా ఇక పైన అచ్చులో రాదు, అచ్చు గ్రుద్దినట్టు అదే రూపంలో కంప్యూటర్ లోనే ప్రత్యక్షమవుతుందిట. అంటే ముద్రణ ఎంత భారమయిపోయింది ఇప్పుడు! ‘మీ కళ్ళు బాగుండాలంటే పుస్తక పఠనమే శరణ్యం, కంప్యూటర్ రీడింగ్ నో నో’ అనే నినాదం ఒకవైపు విన వస్తున్న తరుణంలో ఈ వార్త ఎంత దారుణం! కవిగారన్నట్టు భూమ్మీద సుఖ పడితే తప్పు లేదు కానీ ప్రపంచంలో మంచి పుస్తకాలు సైతం సుఖంగా బతికి బట్ట కట్టాలి. పుస్తకాలంటే కొన్ని స్టాల్స్ లో ఊరికే కనిపించేవి, మరి కొన్ని కొనిపించేవి, కొన్ని బహుమతిగా ఎవరైనా ఇస్తే బావుణ్ణు అని అనిపించేవి - అని మూడు రకాలు. ఒక్కోసారి మంచి పుస్తకాల షాపుకెళితే అందులో సగం షాపు మనింట్లోనే ఉంటే ఎంత బావుణ్ణు అని అనిపిస్తుంది. స్థల పురాణం మన ఇంట్లో సరిపోనితనం గుర్తుచేస్తూ మన ఊహారెక్కల్ని అంతలోనే త్రుంచేస్తుంది. ‘ఈ రోజుల్లో పుస్తకాలు ఎవడు చదివేడిసాడు కనక, కొనడం కూడానా, అదో దండగ’ –ఈ టైపు మాటలు ఊరూరా వింటూనే ఉంటాం. ‘ఏం?’ అని అడగండి. ‘టీవీకి, కంప్యూటర్ కే టైము చాలట్లే- ఇంకా పుస్తకాలోటా!’ చివర్లో వచ్చే ఆశ్చర్యార్ధకం అలా సార్ధకం అవుతోంది. ************* పదండి ముందుకు నాలుగు వైపుల గిరి గీసి చూస్తే... గురువులు మెచ్చిన శిష్యుడు కనపడతాడుclick to zoom ‘కృష్ణప్రేమ’ లో గత గురు వారం , ముప్ఫై ఎనిమిదేళ్ళ క్రితం మనల్ని విడిచి పెట్టి పోయిన కోదండపాణి గారిని స్మరించుకున్నాం. ఈ గురువారం కోదండపాణి తో పాటు ఆయన గురువులనూ తలచుకుందాం. ‘గురువును మించిన శిష్యుడు’ అన్నది కోదండపాణికి దొరికిన బిరుదు కాదు, సినిమా. ఇవాళ మన దురదృష్టం ఏమిటంటే- గురువును ముంచిన శిష్యులే ఎక్కువ. కోదండపాణి గారి కాలంలో ఆయన ‘గురువులు మెచ్చిన శిష్యుడు’. నాలుగు కేటగిరీలుగా గిరి గీసి అందులో కోదండపాణి గారి ప్రతిభని పున: ప్రతిష్టించి మీకందించడమే ఈ పూట నా మాట ప్రయత్నం. 1. కోదండపాణి ‘గురువులు మెచ్చిన శిష్యుడు’ ఎలా అయ్యారు? కోదండపాణి స్వయంగా సంగీత కృషీవలుడే అయినా కోరి సుసర్ల దక్షిణా మూర్తి గారి దగ్గర, కె.వి.మహదేవన్ గారి దగ్గర ‘సహాయకు’డిగా చేరారు. వయోలిన్ కే మారు పేరైన సుస్వరాల సుసర్ల వారు వయో వృద్ధులై (దాదాపు తొంభై ఏళ్లకు పైగా జీవించి) ఇటీవలే కన్ను మూశారు. ఆయన గురించి ‘అన్నా అన్నా విన్నావా’ అంటూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. సంసారం, సంతానం, నర్తనశాల నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర వరకు ఎన్నో సినిమాలు సుసర్ల వారికి దక్షిణగా సమర్పించుకున్నాయి. ఎన్.టి.ఆర్ గారికి ఆయనంటే ఎనలేని అభిమానముండేది. 'మామా మామా మామ' – పాటతో ‘మామ’ గా పేరు పొందిన మహదేవన్ గారి పేరు చివర్లో ‘వన్’ చాలా విలువైనది. మహదేవన్, పుహళేంది వెరసి అతను ఒక్కడే అని అది సూచిస్తుంది. అలాగే తన ‘పల్లవుల’ ఎత్తుగడతోనే శ్రోతల అభిమానం ‘గెలిచారు’ అని కూడ సూచిస్తుంది. ************పదండి ముందుకు సినీవాలి చీకట్లో వెడలెను కోదండపాణిclick to zoom ‘శ్రీరామ నామాలు శతకోటి’ – అబ్బే! అన్ని ఉండవండీ. అది కవి ఆరుద్ర అతిశయోక్తి. నిజానికి విష్ణువుకైనా ‘సహస్ర (వేయి) నామాలే కనుక ఆ శ్రీహరి అంశమైన శ్రీరాముడి నామాలు వేయి ఉండవచ్చు. అందుకే ఆ ఆజానుబాహు రూపాన్ని చూడ వేయి కన్నులు చాలవు. ఆ శ్రీరాముని మరో పేరు కోదండపాణి. శ్రీరామ నవమి నాటి వెన్నెల మెల్ల మెల్లగా పెరుగుతూ పున్నమి రాబోతోంది. ఏదైనా ముందు ముందు అయోధ్యలో కాయబోయే వెన్నెల కోసం అడవిదారుల అమావాస్య చీకటిని భరించడానికి ఆనాడు ‘వెడలెను కోదండపాణి’. అది త్రేతాయుగం. ఇది కలి యుగం. సినీ విపణి - సంగీతపాణి ఇప్పుడు చెప్పబోయేది ఆజానుబాహుడు అయిన రాముడి గురించి కాదు. పొట్టివాడు, అయినా రాముడి లాంటి పేరున్న గట్టివాడు కోదండపాణి అనే పేరున్నవాడి గురించే. ఆ గట్టివాడి పాట వినడానికి వేయి చెవులు చాలవు. నిజమని నమ్మలేని వాళ్ళు పూర్తి పాఠం చదవాల్సిందే. నమ్మేవాళ్ళు చదవకుండా వెళ్ళిపోకండి, పాటలు విందామన్న హడావుడిలో. ఏప్రిల్ 5, 1974 – ఉండేదే, ఆ రోజు విధి రమ్మని పిలవగానే ‘వెడలెను (మన) కోదండపాణి’. సినిమా ప్రపంచానికి ఆనాడు ‘సినీవాలి’ (అమావాస్యకా పేరుంది)! హార్మోనియం మీద పది వేళ్ళ పట్టు ఉన్నా ఆరోగ్యం మీద పట్టు తప్పి ముగిసిపోయిన నాలుగు పదుల వయసు ఆయనిది. అప్పటికి ఆయనకున్న కూతుళ్లతో పాటు కొడుకుఈశ్వర్ కూడ చిన్నవారే. మదన్ మోహన్ సంగీత రహస్యాలు ఇష్టపడే ఈ మదన మోహనుడు ( ఎప్పుడూ టిప్ టాప్ గా డ్రస్సై రికార్డింగ్ థియేటర్ కొచ్చేవారట కోదండపాణి) అతనిలాగానే ‘తొందరపడి’ చిన్న వయసులోనే వెళ్ళిపోయినవాడు. లత‘మీరా భజనలు’ అమితంగా ఇష్టపడి ఆలపించే పాణి, సుశీలమ్మను “ ‘మీరా’మెలాగ పాడేట్టు తీర్చి దిద్దుతాను” అని అన్న మాట నిలబెట్టుకున్న వాడు. ‘మనసే అందాల బృందావనం’ ‘ఇది మల్లెల వేళయనీ’ ‘పూలు పూచెను నా కోసం’ ‘మనసా కవ్వించకే నన్నిలా’ ‘బొట్టూ కాటుక పెట్టుకొని’ ‘ఎన్నడు చూడని అందాలు’ ‘చెలియా సఖియా ఏమే ఈ వేళ’ ‘కమ్మని కలలా కనిపించాడే’ ‘అవునే తానె నన్నేనే’ ‘శృతి చేసి నా వీణ, స్వామీ’ ‘నీవే నీవే నా దైవము’ ‘రావేలా జాగేలా’ ‘ఇంతమాత్రమెరుగవా కన్నయ్యా’ ‘పిల్లన గ్రోవిగ మారితిరా’ ‘ఈ వీణ పైన పలికిన రాగం’ ..’పాడమని పాట వినే’ .. సుశీలమ్మ పాటల పల్లవులన్ని కలిపి సునాయాసంగా కథ చెప్పవచ్చు. సూర్యవంశమునందున శ్రీ రామచంద్రుడు శ్రీరస్తు! శుభమస్తు! శ్రీ రామ జననం చైత్ర శుద్ధ నవమి తిథిని ఇరవై ఏడు నక్షత్రాలల్లోని ఏడవ నక్షత్రమైన పునర్వసు లో జరిగింది. ఆ తొమ్మిది (తిథి), ఈ ఏడు (నక్షత్రం) వెరసి పదహారు కళల చంద్రుడు శ్రీరామ చంద్రుడు సూర్యవంశాన ఉద్భవించాడు. దేవతామూర్తుల వివాహం వారివారి పుట్టిన తిథి,నక్షత్రాల్లోనే జరపడం మానవులమైన మనం తరతరాలుగా ఆచరిస్తున్న ఒక నియమం. అలా – ఇదే నవమి నాడు ‘సీతారామ కళ్యాణం’ జరుపుకునీ అవతారమూర్తి రామయ్యను , సహనశీలి సీతమ్మను పదేపదే తలుచుకుంటూ వడపప్పు, పానకం (పాలూ తేనె కలసినట్లుగా ఆలూ మగలు ఉండాలి – అని కవిగారిలా అనుకోవడం అతిశయమే. వడపప్పు, పానకం వేరు వేరుగా ఉన్నా ఒకరికోసం ఒకరం అన్నట్టుగా ఉంటాయి) మిశ్రమ సేవనంతో తరిస్తాం. అయోధ్య నుంచి అడవికి , అడవి నుంచి అయోధ్యకి ‘ధర్మ రక్షకుడు’ శ్రీరాముడు పయనిస్తూ చవి చూసిన ఎనభై నాలుగు ఋతువుల కాల చక్రం అనుభవాన్ని మహర్షి వాల్మీకి రామాయణ కావ్యంగా అందించాడు. రామాయణ ప్రారంభంలోనే ఒక ప్రత్యేకత ఉంది. అదే- రామ, భరత, లక్ష్మణ , శత్రుఘ్నల జననం- తల్లుల పాయస సేవనం ద్వారా వారి జననం సాధ్య పడడం. అలాగే సీతాదేవి భూమి పొరలనుంచి రాజర్షి జనకునికి లభించడం. ఆధునిక విజ్ఞానం ఎదుట నిలుస్తున్న సంతాన వైఫల్య సమస్యల పరిష్కారాన్ని ఆదికవి కావ్యం ఆనాడే చూచాయగా సూచించింది. ఆ రహస్య మంత్రం లుప్తమై మన పరిశోధనలకి కొత్త ఆశ మాత్రమే ప్రాప్తమైంది. డబ్భైల కాలంలో ఇదంతా ‘ట్రాష్’ అని కొట్టి పారేశేవారు. ఇప్పుడు కాస్త నయం. కాసేపు ఆలోచిస్తున్నారు. శ్రీరామ నామాలు , సపరివార నామాలు దశరథ మహారాజు పెద్ద కుమారుడు రాముడు కాబట్టి రాముణ్ణి ‘దాశరథి’ అనాలి. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు- అనే వరస ఒకనాటి పాట ద్వారా మన చెవిని పడీ పడీ స్థిరపడిపోయింది కాని నిజానికి రాముడు (కౌసల్య పుత్రుడు), భరతుడు (కైక పుత్రుడు), లక్ష్మణశత్రుఘ్నులు (సుమిత్ర కవలలు) అన్నదే వరస. రాముడికి అందరూ తమ్ములే అయినా తమ్ముడు (అనుజుడు) లక్ష్మణుడినే ‘రామానుజుడు’ అంటారు. అతను సుమిత్ర పుత్రుడు కనుక ‘సౌమిత్రి’ అయ్యాడు. తమ్ములందరిలో ప్రతి ఒక్కరిని ‘దాశరథి’ అని అనకూడదు. ఆ పేరు శ్రీరాముడికే పరిమితం. క్షత్రియ ధర్మం ప్రకారం రాజు తరువాత అతని జ్యేష్ట పుత్రుడే పరిపాలకుడు. అయోధ్య పుర వాసులు రాముణ్ణి ‘అయోధ్య రామా’ అని పిలవగలరు. సూర్య వంశీయుడు కనుక రాముడిని ‘రఘు వంశ తిలకా’, ‘రఘురామా’ , ‘రఘువరా’ , ‘ఇనకులాభి సోమా’ ,’రాఘవా’ అని పిలవాలి. రాముడు అయోధ్యలో లేని పక్షంలో భరతుడు రాజ బాధ్యతలు తీసుకోగలడు. ధర్మం అనుసరించడం శ్రీరాముడు కర్తవ్యంగా భావిస్తే అన్నను అనుసరించడం తమ ధర్మమని తమ్ములు భావించారు. మిథిలలో మెదలిన రాముని ఆజానుబాహు రూపాన్ని కోరుకున్న సీత అదే రామునితో అయోధ్యను వీడినప్పుడు అతని పాదాలనే అనుసరించింది. అడవికి అన్న వెళ్ళిపోయినా అతని పాదుకలు పెట్టి రాజ్యమేలాడు భరతుడు. సీతమ్మ వియోగ సమయంలో యజ్ఞం చేయవలసివస్తే స్వర్ణ సీతను నెలకొల్పాడు రాముడు. ఇలా ఎవరికివారే ఆదర్శమూర్తులు. ‘ధర్మం’ పాటించడం క్షత్రియ లక్షణం. అదే రాజు అనదగ్గ వాడి ప్రథమ కర్తవ్యం. శ్రీరాముడు ‘ధర్మజ్ఞ:’ (ధర్మజ: - అని ధర్మరాజు ననాలి) |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|