మునుపటి నా మాట
అమ్మవారు శక్తి స్వరూపిణి. ఈ శారద రాత్రులన్నీ శక్తి మయమే. ఎర్ర రంగు శక్తికి చిహ్నం. ఆ రంగు విప్లవానికి ప్రతీక అని కొన్నాళ్ళు భ్రమలో పడ్డాం. చెడు మీద దాడి చేసి మంచిని బ్రతికించడమే విప్లవమైతే మన లోని ఎర్రటి రక్తం అడుగంట కూడదు, ఉడుకు రక్తం కావాలి. అదే అమ్మవారు నేర్పిన శక్తి పాఠం. కాళీ మాత అనగానే కన్నెర్ర చేసే శక్తి గా, నల్లని రూపంగా భయపడతాం. జేజమ్మ పేరు చెప్పి అనవసరంగా పిల్లల్లో భయం కలిగిస్తాం. మనం సహితం భయంతోనే పూజలు చేస్తాం, భక్తితో చెయ్యాలి అని తెలిసి కూడా. మన అమ్మ కున్నట్టే అమ్మవారిది కూడా చల్లని చూపే. ఇది తెలిసి కూడా నమ్మకం కలగదెందుకు? దేవులపల్లి వారు ‘కోవెల్లో వెలిగే దీపం దేవి మా తల్లి (సుఖదు:ఖాలు, 1967)’ అని ప్రకటించారు. వీటూరి వారు ‘లోకాలేలే చల్లని తల్లీ (ఉక్కు పిడుగు, 1969)’ అని కొనియాడారు కదా ఇంకా సందేహమెందుకు? దాశరథి వారు ఇలా కాదని ‘అమ్మా నీవు లేని తావే లేదు..మా మదిలో నిలిచిపోవమ్మా(పచ్చని సంసారం,1970)’ అని కోరుతూ ‘ఈ లోకులంతా నీ పాపలమ్మా లాలించవమ్మా పాలించవమ్మా’ అని అభ్యర్ధించారు కదా. పాపల్ని లాలించే అమ్మ దెప్పుడూ చల్లని మనసే. అమ్మ దృష్టిలో అంతా సమానులే. ‘పాపులూ పుణ్యులూ నీ పాపలే (కనకదుర్గ పూజా మహిమ, 1960)’ అని అమ్మతో నివేదించుకున్నారు జి.కె. మూర్తి గారు. కాని వింత సృష్టిలో కొందరే మంచివారు, ఎందరో చెడ్డవారు. అసురులు అనండీ రాక్షసులు అనండీ వారిలోనూ మహత్తరమైన జ్ఞానం ఉన్నా అహం పాళ్ళు ఎక్కువ. ఆ విర్రవీగుడు తనమే వారి చేత వెర్రి పనులు చేయిస్తుంది. సురల వ్యధ తీరాలంటే అసురుల కథ ముగియాల్సిందే. అసురల కథ ముగియడమన్నది వారి వధతోనే సాధ్యం. విష్ణువు కొందరిని, పరమశివుడు కొందరిని, శ్రీకృష్ణుడు కొందరిని, శ్రీరాముడు కొందరిని ఇలా పురుషులు వధించిన అసురులు కొందరైతే అమ్మ మాత్రమే వధించగలిగిన అసురులు ఎందఱో ఉండేవారు. అందులో ప్రముఖుడు మహిష ముఖుడు మహిషాసురుడు.
0 Comments
'నా..(ఆవలిస్తూ) కొరియా గుండ్రంగా రాయడం వచ్చు, తెలుగు వంకర టింకరలు లేకుండా వ్రాయడం వచ్చు' 'కొరియా వచ్చు, తెలుగు వచ్చు... అంటే మీరు ప్రపంచ లిపుల్లో ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం పొందిన కొరియా, తెలుగు రెండూ తెలిసినవారిగా గర్వ పడాలి' 'కొరియా కాదండీ స్వామీ .. ఆవలిస్తూ నాకొరియా అనడంలో కొరియా అన్నదే మీకు వినపడింది. నాకు + ఒరియా = నాకొరియా అన్న నా 'సంధి' ప్రేలాపన అలా ఉంది మరి. కనుక నేనన్నది ఒరియా అని గ్రహించగలరు. చిత్తం స్వామీ' 'ఒరియా ఏమిటండీ ..ఇప్పుడది ఉడియా అయింది కదా' 'అభిషేక్ బచ్చన్ గెట్ ఏన్ ఐడియా అన్నట్టు ...గెట్ ఇంటూ ఉడియా..లెద్దురూ' 'కనుక నే చెప్పేది వినండి- ప్రపంచ భాషా లిపులలో కొరియా లిపి మొదటి స్థానం పొందితే మన తెలుగు లిపి రెండో స్థానం పొందింది' 'ఆహా( ... ఇంతకీ ఎవరిచ్చారు ఆ స్థానాలు? ఎవరి ఆస్థానంలో?' 'మద్రాసు విశ్వ విద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు శ్రీ మాడభూషి సంపత్ కుమార్ గారు....' 'ఏ(విటే(విటీ ...ఆయనదా ఈ చి'లిపి' తనం?' 'అదే మరి.. మాట పూర్తి కానివ్వక మధ్యలోఆపితే మీనుంగులు మారిపోయి మీనమేషాలు లెక్కేసుకోవాల్సి వస్తుంది' 'ఆపను లెండి.. కానీండి స్వామీ' కొందరికి పుట్టిన రోజులు తతిమ్మా రోజుల్లాగే అతి సామాన్యం. కొందరికవి శూన్యం- వారెప్పుడు పుట్టారో వారికి తెలియదు, చెప్పే వాళ్ళు ఉండరు. మరి కొందరికి వారి పుట్టిన రోజులు మాత్రం అనన్య అసామాన్యం. కొందరు.. కొందరేమిటీ .. ఆ లెక్కకొస్తే ఇంచుమించు భారతీయులందరూ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారమే జనవరి నుంచి డిసెంబర్ లోగా ఎప్పుడు పుట్టినా ఆ రోజులే సులభంగా గుర్తు చేసుకుంటారు. ఏ కొద్ది మందో 'తిథుల ప్రకారం' అంటూ కష్టపడుతుంటారు. పాతిక, యాభై, అరవై, డబ్భై ఆయిదు ..... ఈ అంకెల తమాషా చిత్రంగానే ఉంటుంది. ఇవి ఏళ్ళు అయితే సిల్వర్, గోల్డెన్, డైమండ్, ప్లాటినం జూబి'లీల' పరంగా వాటి లీలలు ప్రత్యేకత కలిగి ఉంటాయి. 'అరవైలో ఇరవై వయసు ఎవరికైన వచ్చేనా' అని మనసు కవి ఆత్రేయ గారికి కలిగిన సందేహం. 'అరవైకీ ఆరేళ్ళకి ఏమిటి అనుబంధం ..దీపానికి కిరణానికి ఉన్న సంబంధం ...' అని మంచి కవి గోపి గారి ప్రవచనం. 'ఏడాదికే నాలుగేళ్ళు రావాలి ..మా బాబు ఎప్పటికి ముప్ఫయిగ ఉండిపోవాలి' అన్నది మల్లెమాల కవి గారి వింతాశయం. బహుశా ఇలా ముగ్గురు తెలుగు కవులే వయసు మీద మనసు పెట్టి రాశారనవచ్చు. అందుకే 'నా మనసు ఇంకా ముప్ఫయ్యే ' అంటారు ఎనభై దాటిన అక్కినేని. వయసు కన్నా మనసు 'యంగ్' గా ఉండాలని ఆయన శభాష్ అనదగ్గ సుభాషితం పలికారు. అరవై ఏళ్ళకి రిటైర్ అయినాయాన్ని అడిగితే ' అరవై అంటే ఏదో అర వెయ్యి అని పెద్ద మొత్తం అనుకుంటారు - అటు ఆరు ఇటు సున్న ... అందుకే మునుపటి కన్నా ఎక్కువగా భార్య మీద అరుస్తున్నా' అంటారు. మరి డబ్భై మాటేమిటీ ? మూర్తిగారింటికి వెళ్ళాలి. అప్పుడే కదా అన్నాను.. వెళ్ళి మోహన రాగం ఆయన గళం నుంచి వినాలని. ఊరికే అప్పుడలా అన్నానా ...లేక గాంధీ గారే మున్నాభాయికి కనిపించి అతనితో అదేదో సినిమాలో మాట్లాడినట్టు నా చేత అనిపించారా? గాంధీ గారేమిటీ? మోహన రాగం ఏమిటీ? పొంతన లేని గొడవలా అనిపిస్తోందా? ఉంది- పొంతన ఉండబట్టే ఆలోచనలు పొంగి వస్తాయి. గాంధీ గారి పూర్తి పేరేమిటీ? మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ – అవునా? మహాత్ముడి పేరులో మోహన శబ్దం ఉంది కదా. కనుక మోహన రాగం ఈ పూట ఆలపిస్తే ‘మహాత్ముడే కలలు గన్న మరో ప్రపంచం’ అత్యంత మోహనంగా, మోహన కృష్ణుడు మురళి నూదినంత మనోహరంగా ఉంటుంది. మనిషిలో ఏది మోహనం? రూపా? నడవడికా? నన్నే కాదు నిక్సన్ ని అడిగినా, పాబ్లో నెరూదా నడిగినా, ఒబామా నడిగినా, ఒసాబిసా బృందాన్నడిగినా వచ్చే సమాధానం ఒకటే- కసాయి వాడిని సైతం మునిగా మార్చేసే బోసినవ్వు, ఆగిపోవడం కాదు సాగిపోవడమే లక్ష్యం అన్నట్టుండే చక చక నడక, దేశమాత స్వేఛ్చ కోసం కాయలు కాచే కళ్ళు, చిన్న అంగోస్త్రం చాలు సిగ్గు పడే ఈ దేహానికి అనేట్టు ఉండే కట్టు, తనని తాను తీర్చి దిద్దుకోవడానికి భగవద్గీత సాయం కోరే చేతులు, రేపటి చిరుగులకి విరుగుడు మంత్రం సూచించే చరఖా, గుండ్రటి విశ్వం లో కాంతి కిరణాలు దారి తప్ప కూడదని చూపించే కళ్ళజోడు ... వెరసి ఒక మానవుడు భూమ్మీద వెలిశాడు. అటువంటి ఏకైక మానవుడిదే మోహన రూపం. మోహనదాస కరంచంద్రుడిని మహాత్ముణ్ణి చేసిన రూపం. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|