మునుపటి నా మాట
ఎడమ ప్రక్క బొమ్మ ఎవరిదీ? ఎవరదీ? పేరు చెబితే మహాభారతంలో విన్న పేరులా ఉంటుంది. పేరు చెప్పకపోతే మనసు నిండా ఎన్నో పేర్లు పేరుకు పోవచ్చు. అయినా ఇంతటి మండుటెండల్లో ఏదైనా సరే అలా పేరుకు పోవడం అసాధ్యం. ఇంతకీ పేరుకు పోవడానికి అతనేమైనా కొబ్బరి నూనా? కాదే- పోనీ జారు జారుగా జారి పోయే కొబ్బరి నీరా? నిశితంగా పరిశీలిస్తే అతని వర్చస్సులో సరిగమల సరస్సు కానరావడం లేదూ? అయితే కచ్చితంగా అతని స్వర రచన నారీకేళ పాకమేమో? కాకపోతే శృతి లయలకి సరి తూకమేమో? ఆయన ఒక మిలటరీ కమాండర్ గారి అబ్బాయి కనుక 'సరిగమపదని' స్వరాల్ని సరిగ పదమని ఆదేశించే ప్రజ్ఞా 'పాట’వం అతనికుండేది. అటువంటి కన్నతండ్రి సన్యాసుల్లో కలిసిపోతేనేం, అమ్మ, మేనమామ, తాతయ్యల అండతో సంగీతాన్ని సన్యసించక అందులోని విన్యాసాలు ఆకళింపు చేసుకోవాలని పట్టుబట్టిన వాడు ఆయన. అతని పేరు పలకడమెంత కష్టమో వ్రాయడం అంతే కష్టం. చెప్పగా చెప్పగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ తప్పుల్లేకుండా అతని పేరు చూపగలుగుతోంది. ఉన్నట్టుండి ఆయన గురించి ఏమిటీ భోగట్టాలు? ఎందుకంటే 1975 మే 21 నాటి మాట. నాలుగు దక్షిణ భాషల్లో చక్కని పాటల మూటలు మిగిల్చి నలభై ఎనిమిది ఏళ్ళు పూర్తి కాక ముందే నాలుగు ముఖాలాయన పిలుపందుకొని సరస్వతమ్మ కొలువుకి ఆయన తరలి వెళ్లిపోయినది ఆ రోజే కనుక. ఇది మే నెల కనుక, ఆ రోజు సమీపంలో ఉంది కనుక... ఒక్కసారి మననం చేసుకోవాలని.. మనం మనం బరంపురం... అనుకున్నాం కనుక.....
0 Comments
హృద్యమైన పద్యం: ‘నేనొక/ పూలమొ/క్క కడ/ నిల్చి చి/వాలున /కొమ్మ వం/చి గో రానెడు/నంతలో/న విరు/లన్నియు/ జాలిగ/ నోళ్ళు వి/ప్పి మా ప్రాణము/లు తీతు/వా యంచు/ బావురు/మన్నవి ……. తెలుగు పద్యాల్లో ‘వృత్తములు’ అనేవి నేర్చుకున్నప్పుడు, అంటే ఇలాంటి పద్యమొకటి చదివినప్పుడు, పద్యపాదంలోని తొలి అక్షరాన్నియతి అంటారని కొత్తగా చెప్పనక్కర్లేదు. ‘యతి మైత్రి’ అనేది ఇలాంటి పద్యాలు రాయడానికి ఎంత సహకరిస్తుందో మనకి తెలుసు. యతి స్థానం లో కొన్ని అక్షరాలకి మరి కొన్ని అక్షారాలతో మిత్రలాభం ఉంటుంది. ఉదాహరణకి- త-ద, ప-బ-వ, చ-జ-స, క-గ, ర-ల, న-ణ. ఉత్పలమాలలో పదవ అక్షరం, చంపకమాల,మత్తకోకిల వృత్తాల్లో పదకొండవ అక్షరం, శార్దూల వృత్తంలో పదమూడవ అక్షరం యతిస్థానం అని నియమం ఉంది. కరుణశ్రీ వారి ఈ పద్యం పూల మీద పద్యం కాబట్టి ఉత్పలమాల వృత్తంతో ప్రారంభించారు ఆ కవీశ్వరులు. ఇక్కడి పద్యంలో లావుపాటి అక్షారాలు ఆ యతిమైత్రిని చూపిస్తున్నాయి. ఈ వృత్త పద్యాల్లో ప్రతి పాదంలో వచ్చే రెండవ అక్షరం ప్రాస. ఇక్కడ పువ్వుల పద్యంలో నకారం అలా వచ్చినదే. నన అన్నా పువ్వే. బహుశా అందుకే పూల మీద పద్యాల్ని నకార ప్రాసతో ప్రారంభించారు కరుణశ్రీ కవి. ప్రాసలు ఆరు రకాలు. ‘నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే....ఎవరేమన్నా’ ‘ఆగండాగండి...ఇది మీ పాట కాదనుకుంటానూ.. పోనీ నా ఎదుట ఉన్నారు కదా కనీసం నా పాటైనా పాడుకుంటున్నారు అని అనుకున్నాను... ఈ 'పర' పాట ...మీ పొరపాటా?’ ‘అయ్యా... మాటలంటే మీవే. మీ కలం నుంచి ఒక మాట జారిందే అనుకోండి...ఇంక అది జనం నోట నానాల్సిందే. నిజమే ఇది పర పాటే. కవికి తన పాట కన్నా ఇతర కవుల పాటలే నోటికి రావాలి. అప్పుడే తన పాట లో వారి మాటలు రాకుండా జాగర్త పడతాడు ...అని నా చేత భూలోక వాసులకి చెప్పాలనేగా మీ ఎత్తుగడ?’ ‘ఎత్తుగడ లేదు ..తలగడ లేదు.. మనది స్వర్గ లోకం. అప్పుడు భూమ్మీద ఉన్నప్పుడూ స్వర్గ లోకమే. చచ్చి స్వర్గానికొచ్చినా స్వర్గ లోకమే. అయినా.. మీకెలా ఉందో కాని ఒక్క ఈగా, దోమా అనేది లేకుండా ఇక్కడ చస్తున్నాం కదా. అవుంటే ఎంచక్కా వాటిమీద మన వాళ్ళు సినిమాలు తీసేవారు, మనం పాటలు రాసేవారం’ ‘దోమ సంగతి తెలియదు కాని ఈగ మీద సినిమా వాలిందట. అన్నమయ్య మీద సినిమా వచ్చిందట కాని అందులో ఆయన కీర్తన ఉందే...పన్నగపు దోమతెర పైకెత్త వలె..అది మాత్రం లేదట.’ ‘ఇంకా భూలోకం వేపు తొంగి చూస్తూనే ఉన్నారన్నమాట. అవును మరి... నాకన్నా ఆలస్యంగా ఇక్కడికొచ్చారాయే.’ ‘అబ్బబ్బే... పాపం సుందర రామమూర్తి ఈ మధ్యనే ఇక్కడికొస్తే తెలిసింది.’ ‘ఆ రామమూర్తి కవే అనుకుంటే .. . అదేమిటో ... టి.కె. రామమూర్తి ....వయోలిన్ మేధావి, గొప్ప స్వర కర్త కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడి కొచ్చారు.’ |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|